కాకినాడ జేఎన్టీయూ కి వచ్చిన మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన టిడిపి క్యాడర్లో జోష్ నింపింది. చాలాకాలం తర్వాత లోకేష్ ను కలుసుకునే అవకాశం రావడంతో యువత, మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు పూర్తిగా పార్టీ సహకారం ఉంటుందని లోకేష్ చేసిన వ్యాఖ్యలు మరింత జోష్ నింపాయని క్యాడర్ చెబుతున్నారు.









