టాలీవుడ్లో ఆసక్తి రేపిన కాంబినేషన్లలో శర్వానంద్ – శ్రీను వైట్ల ప్రాజెక్ట్ కూడా ఒకటి. కమర్షియల్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేసిన ఈ సినిమా మొదట్లోనే మంచి బజ్ను సొంతం చేసుకుంది. శర్వానంద్కు సూట్ అయ్యేలా కథ, క్యారెక్టరైజేషన్ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఇద్దరి కెరీర్కీ కీలకంగా మారుతుందనే అంచనాలు కూడా వ్యక్తమయ్యాయి.
మేకర్స్ ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలో దింపాలని టార్గెట్ పెట్టుకున్నారు. సంక్రాంతి సీజన్ అంటే భారీ సినిమాల పోటీ ఉన్నప్పటికీ, అదే సమయంలో మార్కెట్ కూడా బలంగా ఉంటుందని భావించి గ్రాండ్గా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. నిర్మాణ విలువల్లో ఎలాంటి రాజీ లేకుండా భారీ స్థాయిలో సినిమాను రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం, సినిమా బడ్జెట్ అనూహ్యంగా పెరుగుతుండటం ఇప్పుడు నిర్మాతను ఆలోచనలో పడేసిందట. ఖర్చులు కంట్రోల్లో లేకపోవడంతో ప్రాజెక్ట్ను ఇదే స్కేల్లో కొనసాగించాలా? లేక కొంత మార్పులు చేయాలా? అన్న దానిపై సందిగ్ధ పరిస్థితి నెలకొంది.
ఒకవైపు సంక్రాంతి రిలీజ్ టార్గెట్ ప్రెషర్, మరోవైపు పెరుగుతున్న బడ్జెట్… ఈ రెండు కారణాలతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం డైలమాలో పడినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా భవిష్యత్పై క్లారిటీ రావాలంటే ఇంకొంత సమయం పట్టే అవకాశముంది.








