ఇటీవల మృతిచెందిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ స్వగృహంలో కలసి పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన కరప మండల అధ్యక్షులు బండారు మురళి,మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్, పెనుగుదురు మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచరరావు, గ్రామ అధ్యక్షులు బత్తిన సతీష్, బండారు బాబ్జి, తనుకుల రాజు తదితరులు ఉన్నారు.









