కరప మండలంలోని గ్రామ పంచాయతీలకు యుపిఎస్ ను ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అందజేశారు.కరపలో చంద్రన్న సమావేశ మందిరంలో స్వర్ణగ్రామ,వార్డ్ సచివాలయల యుపిఎస్ లు ఏర్పాటు ద్వారా కంప్యూటర్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు సేవలు వేగవంతంగా అందుతాయని ఎమ్మెల్యే అన్నారు.ఎంపీడీఓ జె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని 20 గ్రామాల కార్యదర్శులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా,ముద్రగడ రమేష్,బండారు మురళి,బోగిరెడ్డి కొండబాబు, దూడల నారాయుడు, అనుకూల రాంబాబు,మెండు గోవింద్,యాళ్ల పండు, పబ్బినీడి వెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.








