శ్రీను వైట్లను టాలీవుడ్కి కామెడీ ఎంటర్టైనర్ల డైరెక్టర్గా నిలిపిన సినిమా ఢీ’. అప్పటిదాకా రొమాంటిక్ డ్రామాలు మాత్రమే తెరకెక్కించిన వైట్ల, ఈ సినిమా ద్వారా తనకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో, అంచనాల్లేకుండా
విడుదలైన ఈ సినిమా, విడుదలయ్యాక భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్లో కామెడీ ఎంటర్టైనర్లకు ఇది కొత్తగా రూట్ గా నిలిచింది..
ఈ సినిమా సక్సెస్ తరువాత శ్రీను వైట్ల కెరీర్ మలుపు తిరిగింది.. రవితేజ ,నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్లలో స్థానం సంపాదించారు. అయితే గత కొంత కాలంగా వైట్ల ఫామ్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తర్వాత తక్కువగా కనిపించిన ఆయన, మళ్లీ ‘ఢీ-2’తో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు..
ఢీ సీక్వెల్ పై గతంలోనే మంచు విష్ణుతో కలిసి ప్రాజెక్టును అనౌన్స్ చేశారు.. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ప్రారంభం కాలేదు.. ఈ మధ్యకాలంలో వైట్ల ‘విశ్వం’ అనే చిత్రాన్ని గోపీచంద్తో తెరకెక్కించారు. ఇక విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మీద దృష్టి పెట్టడంతో సీక్వెల్ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయింది..
తాజాగా విష్ణు ఈ అంశంపై స్పందించారు. “‘ఢీ’ నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన సినిమా. దానికి సీక్వెల్ చేయడాన్ని చాలా ఇష్టపడతా.. కానీ ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తిగా రెడీ కాలేదు. అది శ్రీను వైట్ల, రచయితల చేతుల్లో ఉంది. వాళ్లు బలమైన కథతో వస్తే, వెంటనే షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు..
అంటే, గతంలో ‘ఢీ-2’ ప్రకటన చేసినా, పూర్తి కథ రెడీ కాకముందే ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. బేసిక్ లైన్ ఉంటే ఉండొచ్చు, కానీ అది విష్ణుని మెప్పించలేకపోయినట్టుంది. ఇప్పుడు ‘విశ్వం’తో కొంత మెరుగైన ఫలితాన్ని అందుకున్న శ్రీను వైట్ల, మళ్లీ ‘ఢీ-2’ స్క్రిప్ట్పై దృష్టి పెట్టి ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించగలరా..?