గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పెద్ది.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా రామ్ చరణ్ ఇందులో ఓ క్రికెటర్గా కనిపించబోతున్న సంగతి స్పష్టమైంది.. టీజర్ లో వచ్చిన ఆ ఫస్ట్ షాట్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది..ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది..ఐతే తాజాగా ఈ సినిమా నుండి ఓ అప్డేట్ బయటకు వచ్చింది.. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఒక భారీ ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు..ఈ ఫైట్ సీన్ సినిమా మొత్తంలో కీలకమైనదిగా ఉండబోతున్నట్లు సమాచారం.. అంతే కాదు ఈ ఫైట్ సీన్ థియేటర్స్ లో ఫాన్స్ కు పూనకలు వచ్చే రేంజ్లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.. షూటింగ్ సెట్ నుంచి వస్తున్న సమాచారం మేరకు, ఈ సన్నివేశం ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.. ఇక ఓటీటీ హక్కుల విషయంలోనూ ‘పెద్ది’ సినిమా కొత్త రికార్డులు సృష్టించే దిశగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. మొదట ఇది రూ.120 కోట్లు అన్న వార్తలు వస్తున్నాయి, ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి..ఈ ఒప్పందం రామ్ చరణ్ కెరీర్లోనే భారీ ఓటీటీ డీల్ కావడం విశేషం. గతంలో ప్రమోషన్ లేకుండానే ‘ఉప్పెన’ను బుచ్చిబాబు బ్లాక్బస్టర్గా మలిచారు. ఇప్పుడు రామ్ చరణ్ క్రేజ్, జాన్వీ కపూర్ గ్లామర్, బుచ్చిబాబు స్టోరీటెల్లింగ్ అవుతూ ‘పెద్ది’ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి..ఈ సినిమా నిజంగానే ప్రేక్షకులకు ఓ విజువల్ ట్రీట్ అందించబోతుందన్నది ఖాయంగా కనిపిస్తుంది… ఇక సినిమాను వృద్ధి , మైత్రి మూవీ, సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు..
