లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో మరో మైల్స్టోన్కు రంగం సిద్ధమవుతోంది.. కార్తీ హీరోగా, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఖైదీ విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచిన విషయం అందరికీ తెలిసింది.. ఖైదీ సినిమాలో హీరోయిన్, ఒక్క పాట కూడా లేకుండా ఒకే రోజు రాత్రి జరిగే డ్రగ్స్ కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. అంతే కాదు ఈ సినిమాతో లోకేష్ కనగరాజ్ తన యూనివర్స్ ను మొదలు పెట్టాడు.. ఐతే ఈ సినిమా చివర్లో ఖైదీ సినిమాకి సీక్వెల్ ఉన్నట్లు లోకేష్ ఎప్పుడో ప్రకటించాడు.. ఇప్పుడు
‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్గా ‘ఖైదీ 2’త్వరలో తెరపైకి రానుంది.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సీక్వెల్పై అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది..‘ఖైదీ’ విడుదల తరువాత, లోకేశ్ కనగరాజ్ వరుసగా కమల్హాసన్తో ‘విక్రమ్’ మరియు విజయ్ తో లియో సినిమా చేశాడు.. ప్రస్తుతం రజనీకాంత్తో కూలీ’సినిమాల్లో బిజీగా మారిపోయాడు. వీటి వల్ల
ఖైదీ 2’షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ‘కూలీ’ సినిమా రిలీజ్ కి దగ్గరవ్వడంతో
లోకేశ్ మళ్లీ ‘ఖైదీ 2’పై ఫోకస్ పెడుతున్నారు..ఐతే ఈ సినిమా సంబంధించిన ఓ రూమర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. తాజా సమాచారం ప్రకారం, ఈ సీక్వెల్లో టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఒక కీలక రోల్ లో నటించనున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతుంది..‘ఖైదీ’ సినిమాలో కార్తీ కూతురు పాత్రను చూపించినా, ఆయన భార్య గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.. ఈసారి ఆ మిస్టీరియస్ పాత్రకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్.. అనుష్క శెట్టి ఈ పాత్రలో కనిపించే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి..చూడాలి మరి ఈసారి ఖైదీ 2 ఎలా ఉండబోతుందో..