Search
Close this search box.

  యువగళంలో ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చింది: మంత్రి నారా లోకేశ్..

October 13, 2024 4:37 PM | Aditya369 News

యువగళంలో ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చింది: మంత్రి నారా లోకేశ్..

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం తమ బాధ్యత అని ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. యువగళంలో ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చిందని వెల్లడించారు.

 

వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రజలు కోరారని, ఆ మేరకు బోయ, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు పాదయాత్రలో తనకు విజ్ఞప్తి చేశారని వివరించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నెల 17న అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతిని నిర్వహించాలని ఉత్తర్వులు వెలువడ్డాయని లోకేశ్ తెలిపారు.

 

అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం తమ బాధ్యత అని ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. యువగళంలో ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చిందని వెల్లడించారు.

 

వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రజలు కోరారని, ఆ మేరకు బోయ, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు పాదయాత్రలో తనకు విజ్ఞప్తి చేశారని వివరించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నెల 17న అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతిని నిర్వహించాలని ఉత్తర్వులు వెలువడ్డాయని లోకేశ్ తెలిపారు.

 

అనంతపురంలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు