టాలీవుడ్లో తనదైన క్లాస్ మరియు సెన్సిబుల్ చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులు, ఓవర్సీస్ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇటీవల ధనుష్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘కుబేర’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న శేఖర్ కమ్ముల, దాదాపు ఏడాది కాలం పాటు శ్రమించి ఒక కొత్త అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ కొత్త చిత్రాన్ని ఏషియన్ సునీల్ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్లో హీరోగా ఎవరు నటించనున్నారనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ప్రస్తుతం టాలీవుడ్లోని అగ్ర హీరోలు, యువ హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో సరైన హీరో ఎంపికపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల పలువురు హీరోలను కలిసి తన కొత్త స్క్రిప్ట్ను వినిపించేందుకు సమావేశాలు ప్లాన్ చేస్తున్నారట. అవసరమైతే ఇతర భాషల నటులను కూడా సంప్రదించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
శేఖర్ కమ్ముల వర్కింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా పర్ఫెక్ట్గా రావాలని భావించే ఆయన, సెట్స్పై ఎక్కువ సమయం కేటాయిస్తారు. ప్రతి సన్నివేశం తనకు నచ్చే వరకు రాజీపడకుండా పనిచేస్తారు. అందువల్ల ఆయనతో సినిమా చేసే హీరో దాదాపు ఏడాది పాటు ఈ ప్రాజెక్ట్కే సమయాన్ని కేటాయించాల్సి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
మరి శేఖర్ కమ్ముల లాంటి క్లాస్ డైరెక్టర్తో పని చేసే ఈ ప్రత్యేక అవకాశాన్ని ఏ హీరో అందుకుంటారో చూడాలి. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







