సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం **’వారణాసి’**పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ సినిమా నుంచి రాబోయే అతిపెద్ద ప్రాజెక్ట్లలో ఇదొకటిగా సినీ అభిమానులు భావిస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండనున్నాయని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. అందులో అత్యంత ఆసక్తికరమైన అంశం రామాయణం ఎపిసోడ్ అని ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన మోషన్ టీజర్లో ఈ ఎపిసోడ్కు సంబంధించిన చిన్న గ్లింప్స్ మాత్రమే చూపించారు. అయితే మహేష్ బాబు శ్రీరాముడి గెటప్ను మాత్రం ఇప్పటివరకు పూర్తిగా రివీల్ చేయలేదు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. ఆగస్టు 9న మహేష్ బాబు అభిమానులకు ప్రత్యేక సర్ప్రైజ్గా శ్రీరాముడి లుక్ను విడుదల చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.
అయితే ఈ లుక్ సినిమాకే అతిపెద్ద హైలైట్లలో ఒకటిగా భావిస్తున్న నేపథ్యంలో… దర్శకుడు రాజమౌళి నిజంగానే అంత ముందుగానే రివీల్ చేస్తారా? లేక ప్రేక్షకులు థియేటర్లలోనే మహేష్ బాబు విశ్వరూపాన్ని చూసేలా సస్పెన్స్ను కొనసాగిస్తారా? అనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.
ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








