మాస్ మహారాజా రవితేజ, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు కలిసి ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ అరుదైన కాంబినేషన్పై అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మల్టీస్టారర్కు ‘వీరాధి వీరులంట’ అనే పవర్ఫుల్ టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టైటిల్కు సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ పేరు మాత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించనున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాను సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరి రవితేజ – శ్రీవిష్ణు కాంబో నిజంగానే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.








