టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ బంధంపై వస్తున్న వార్తలు ప్రస్తుతం పరిశ్రమలో హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ మేనమామ, ప్రముఖ నిర్మాత యష్ రంగినేని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ వ్యక్తిత్వంలో వచ్చిన సానుకూల మార్పుల వెనుక రష్మిక ప్రభావం ఎంత ఉందో ఆయన వివరించారు. రష్మిక రాకతో విజయ్ ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా మారాడని ఆయన ప్రశంసించారు.
గతంలో విజయ్కు పెళ్లి పట్ల అస్సలు ఆసక్తి ఉండేది కాదని, కేవలం తన కెరీర్పైనే పూర్తి దృష్టి పెట్టాలని భావించేవాడని యష్ రంగినేని వెల్లడించారు. అయితే రష్మిక పరిచయం తర్వాత అతడి ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు. కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం విజయ్ నేర్చుకున్నాడని, ఈ మార్పు పట్ల తమ కుటుంబమంతా ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ‘విరోష్’ జంట మధ్య ఉన్న అనుబంధం ఎంతో అన్యోన్యంగా ఉంటుందని ఆయన కొనియాడారు.
ఇదే సమయంలో సెలబ్రిటీల మధ్య తరచూ వినిపించే విభేదాలు, విడాకుల వార్తల నేపథ్యంలో మొదట్లో కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చెందిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే ఒకరిపై ఒకరికి ఉన్న అపారమైన గౌరవం, పరస్పర అవగాహన చూశాక ఆ భయాలన్నీ తొలగిపోయాయని రంగినేని వివరించారు. భవిష్యత్తు గురించి ఎవరూ కచ్చితంగా చెప్పలేమని, కానీ ఆ దేవుడి దయతో వీరిద్దరూ జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు.








