16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే అంశంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తోంది.ఈ విషయంపై సమగ్ర అధ్యయనం చేయాలని పోలీస్శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.సోషల్ మీడియాలో పెరుగుతున్న విచ్చలవిడితనానికి బ్రేకులు వేయాలని వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకురావడానికీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.ఈ నిర్ణయం అమల్లోకి వస్తే చిన్నారుల ఆన్లైన్ భద్రత, సోషల్ మీడియా వినియోగంపై రాష్ట్రంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.









