సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినిమాలతో మాత్రమే కాదు, రీ-రిలీజ్ ట్రెండ్లోనూ సత్తా చాటుతున్నారు. ఆయన నటించిన ఖలేజా చిత్రం మే 30న తిరిగి విడుదలై, ఓపెనింగ్ డేనే రూ.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ కలెక్షన్లతో ఖలేజా రీ-రిలీజ్ డే 1లో రూ.5 కోట్ల మార్క్ దాటిన నాలుగో చిత్రంగా నిలిచింది..ఇందుకు ముందు ఈ ఘనతను గబ్బర్ సింగ్, మురారి, బిజినెస్ మాన్ సినిమాలు అందుకున్నాయి. ఈ మూడు చిత్రాల్లో మురారి మరియు బిజినెస్ మాన్ మహేశ్ బాబుది కావడం విశేషం. ఇక డే-1 రీ-రిలీజ్ కలెక్షన్లలో టాప్ ప్లేస్లో కొనసాగుతున్న చిత్రం మాత్రం పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన *ఖలేజా* ఒక ఊరి సమస్యను పరిష్కరించేందుకు వెళ్లిన ఓ సామాన్య వ్యక్తి అ Extraordinary రీతిలో పరిష్కారాన్ని ఎలా అందించాడు అన్న కాన్సెప్ట్ ఆధారంగా రూపొందింది. ఇందులో అనుష్క శెట్టి కథానాయికగా నటించింది.. ప్రారంభంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయిన ఖలేజా, కాలక్రమంలో కల్ట్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఇప్పుడు రీ-రిలీజ్లో తాను కలెక్షన్ల పట్ల ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది..