మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కే అవకాశాలపై సినిమావర్గాల్లో బలమైన చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్టును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించనున్నారనే వార్తలు ఇప్పుడు వేగంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించారనే ప్రచారం ఉంది. ‘బన్నీతో ఆలస్యం అవుతుంది, గ్యాప్లో చరణ్తో సినిమా చేస్తే బాగుంటుంది’ అనే కోణంలో పవన్ స్వయంగా త్రివిక్రమ్కు ఈ దిశగా సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది…
ఇందులో కీలకమైన అంశం ఏంటంటే – త్రివిక్రమ్ ప్రస్తుతం రామ్ చరణ్కు వినిపించిన స్క్రిప్ట్ అసలు కొత్తది కాదు. అదే కథను మొదట అల్లు అర్జున్ కోసం రాశారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ను అప్పట్లో అధికారికంగా ప్రకటించినప్పటికీ, అట్లీ అర్ధాంతరంగా బన్నీని అప్రమత్తం చేయడంతో అది హోల్డ్లో పడిపోయింది. బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమా పైనే ఫోకస్ పెట్టిన కారణంగా త్రివిక్రమ్ కథకి బ్రేక్ పడ్డారు…
అట్లీ సినిమా పూర్తి కావడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని అంచనా వేయడంతో త్రివిక్రమ్ తన ప్లాన్లు మార్చుకున్నారు. అదే కథను రామ్ చరణ్కు వినిపించి, వెంటనే ప్రాజెక్ట్ను షురూ చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్లారు. రామ్ చరణ్ కూడా ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతూ, “RC17 తర్వాత ఈ సినిమాను లైన్లో పెడదాం” అని హామీ ఇచ్చినట్లు మెగా వర్గాల నుంచి సమాచారం..