తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ధర్మకర్తల మండలి సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది.తొలుత ఈ నెల 8వ తేదీన సమావేశాన్ని నిర్వహించాలని ఏర్పాట్లు చేసినప్పటికీ పరిపాలనా కారణాలతో 24వ తేదీకి వాయిదా వేశారు.ఆ రోజున ప్రధానంగా 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు.
