ఏపీలో 1,535 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు.మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతాయి.ప్రథమ,ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 10,58,892 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వనున్నా రు.వేసవి దృష్ట్యా ఆయా కేంద్రాలవద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రశ్న పత్రాల లీకేజీ వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.









