కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ మేడికో విద్యార్థి మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. రంగరాయ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఎంబి బిఎస్ విద్యార్థి రావూరి సాయిరాం RMC బాయ్స్ హాస్టల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.









