Search
Close this search box.

  ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది: సుప్రీంకోర్టు తీర్పుపై మంద కృష్ణ స్పందన..

August 1, 2024 7:18 PM | Aditya369 News

ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది: సుప్రీంకోర్టు తీర్పుపై మంద కృష్ణ స్పందన..

విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ సమంజసమేనని, ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు నేడు చారిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. దీనిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ స్పందించారు.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తోందని వెల్లడించారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబరు 5నే చెప్పానని, నేడు సుప్రీంకోర్టు తీర్పుతో అది నిజమైందని వ్యాఖ్యానించారు.

న్యాయం, ధర్మం కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేసి విజయం సాధించామని చెప్పారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఎమ్మార్పీఎస్ పోరాడిందని తెలిపారు.

విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ సమంజసమేనని, ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు నేడు చారిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. దీనిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ స్పందించారు.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తోందని వెల్లడించారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబరు 5నే చెప్పానని, నేడు సుప్రీంకోర్టు తీర్పుతో అది నిజమైందని వ్యాఖ్యానించారు.

న్యాయం, ధర్మం కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేసి విజయం సాధించామని చెప్పారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఎమ్మార్పీఎస్ పోరాడిందని తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు