Search
Close this search box.

  కేసీఆర్ కు మరో లేఖ రాసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్..!

June 26, 2024 12:10 PM | Aditya369 News

కేసీఆర్ కు మరో లేఖ రాసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్..!

గత ప్రభుత్వ హయాంలోని విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం కేసీఆర్ ను వదిలేట్టు లేదు. కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరో లేఖ రాసింది. నాటి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి మరింత సమాచారం కోరుతూ ఈ నెల 19న కమిషన్ లేఖ రాసింది. ఈ లేఖలో పేర్కొన్న అంశాలకు జూన్ 27 లోపు బదులివ్వాలని స్పష్టం చేసింది.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోళ్లు జరపడంపై మరిన్ని వివరాలు కావాలని కేసీఆర్ ను కమిషన్ కోరింది. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై మరింత సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాదు, విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ఈ మధ్య కాలంలో కొందరు లేవనెత్తిన సందేహాలను కూడా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తన లేఖకు జత చేసింది.

గత ప్రభుత్వ హయాంలోని విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం కేసీఆర్ ను వదిలేట్టు లేదు. కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరో లేఖ రాసింది. నాటి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి మరింత సమాచారం కోరుతూ ఈ నెల 19న కమిషన్ లేఖ రాసింది. ఈ లేఖలో పేర్కొన్న అంశాలకు జూన్ 27 లోపు బదులివ్వాలని స్పష్టం చేసింది.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోళ్లు జరపడంపై మరిన్ని వివరాలు కావాలని కేసీఆర్ ను కమిషన్ కోరింది. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై మరింత సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాదు, విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ఈ మధ్య కాలంలో కొందరు లేవనెత్తిన సందేహాలను కూడా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తన లేఖకు జత చేసింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు