ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై ఇజ్రాయేల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఆయన మృతి చెందినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మృతిచెందినట్లు ఇరాన్ రివల్యూషన్ గార్డ్(ఐఆర్జిసి)అధికారికంగా మీడియాకు వెల్లడించింది. 40 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. అయితే ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయేల్, అమెరికా భవిష్యత్తులో చూడని దాడులు చూస్తారని హెచ్చరించింది. ఇజ్రాయేల్-అమెరికా దాడుల్లో ఖమేనీ సలహాదారుడు అలీ షంఖానీతోపాటు, ఐఆర్ జిసి చీఫ్ పాక్ పౌర్ మృతిచెందడంతో ఇరాన్కి కోలుకోలేని దెబ్బతగిలింది.









