గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపి,పిఎంపీ లు సేవలు ఎనలేనివని కాకినాడ సన్ రైజ్ హాస్పిటల్ ప్రముఖ ఏముకుల వ్యాధులు వైద్యులు బి సూర్యారావు అన్నారు.కరప లో గ్రామీణ వైద్యులు,కెమిస్ట్, ల్యాబ్ నిర్వాహకులు కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ చిల్డ్రన్స్, షుగర్, స్త్రీ వ్యాధులు నిపుణులు, డాక్టర్ అపర్ణ పసుపులేటి మాట్లాడుతూ గ్రామాల్లో పూర్తి స్థాయి వైద్యం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారం లో రెండురోజులు కరప లో శ్రీ లక్ష్మి భవ్య క్లినిక్ నందు వైద్య సేవలు అందిస్తూన్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమం లో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరావు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం త్వరలో పారామెడిక్స్ ట్రయినింగ్ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో కెమిస్ట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సాధనల శ్రీనివాస్ రావు, మెడికల్ ప్రాక్టీస్ నర్స్, గ్రామ పెద్ద లు పోలిశెట్టి తాతిలు, వైస్ ఎంపీపీ పాటినీడి భీమ్మన్న, గొర్రెల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.








