పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పాడా కార్యాలయంలో బుధవారం మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్ర డైరక్టర్ డాక్టర్ సంపత్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు రెండు పట్టణాలకు సంబంధించి మున్సిపల్ అధికారులు సమావేశానికి హాజరుకావాలని అధికారులు సమాచారం ఇచ్చారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల్లో తాగునీరు, చెత్త సేకరణ, వీధి దీపాలు, నూతన నిర్మాణాలు, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలు వంటి దాదాపుగా మున్సిపాల్టీలకు అనుబంధంగా ఉన్న అన్ని సమస్యలపైనా, అభివృద్ధి పనులకు ప్రణాళికలపై సమీక్షలో చర్చించనున్నారు.








