సామర్లకోట పట్టణంలో మున్సిపల్ కుళాయిల నుండి త్రాగునీరు పసరు రంగుతో, దుర్గంధభరితంగా వస్తుందని పట్టణవాసులు వాపోతున్నారు. గత కొంతకాలం నుండి పరిస్థితి ఇలాగే ఉన్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని కాకినాడ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ ఆరోపించారు. అపరిశుభ్రమైన తాగునీటివలన ప్రజలకు డయేరియా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు తక్షణం స్పందించాలని కోరారు.








