కరప మండలం పెనుగుదురు జెడ్పి ఉన్నత పాఠశాలలో బాల్య వివాహ్ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం సిడిపిఓ వై లక్ష్మి ఆధ్వర్యంలో హెచ్ ఎం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు.జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ చినబాబు మాట్లాడుతూ బాల్య వివాహం చేస్తే చట్టం ప్రకారం రెండు సం రాల జైలు శిక్ష,రూ లక్ష జరిమానా విధిస్తరన్నారు.ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.విద్యార్థులతో బాల్య వివాహాల వ్యతిరేక ప్రతిజ్ఞతో పాటుర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి,పారాలీగల్ వాలంటీర్ మల్లికార్జునరావు,అబ్దుల్,ఆశా, అంగన్వాడీ,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.








