ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఐచ్ఛిక సెలవు(OH) ప్రకటించిన నేపథ్యంలో PGRS ను రద్దు చేశారు. అయినప్పటికీ అర్జిదారులు నేరుగా ఫోన్లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1100 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఫిర్యాదులను 1100 నెం ద్వారా నమోదు చేసుకోవచ్చని, అదే విధంగా ఆయా అర్జీల పరిష్కార స్థితిని తెలుసుకునే అవకాశం ఉందని తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 95523 00009 కు ఫోన్ చేసి సత్వర పౌర సేవలు పొందవచ్చని కలెక్టర్ కీర్తి స్పష్టం చేశారు.









