కె గంగవరం మండలం కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా కోటి దీపారాధన మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమనికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా హాజరయ్యి ప్రత్యేక పూజలు అనంతరం మంత్రి సుభాష్ మొదటి దీపం వెలిగించచారు.అనంతరం భక్తులు దీపాలను వెలిగించారు.ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం ఆర్డీవో దేవరకొండ అఖిల, రామచంద్రపురం డి.ఎస్.పి రఘువీర్,ఆలయ ప్రత్యేక అధికారి రాంబాబు రెడ్డి,ఆలయ ఈవో భీమశంకరం, ప్రజాప్రతినిధులు,పోలీస్,వివిధ శాఖల అధికారులు పాల్గున్నారు.








