కరప మండలంలో వివిధ గ్రామాల్లో మహాశివరాత్రి సందర్భంగా కరప, వేళంగి,కూరాడ శివాలయాల్లో శివనామ స్మరణతో మార్మోగాయి. తెల్లవారుజామున నుంచే ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆయా ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది.ఆలయ అధికారులు, కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం, దీపారాధనలు నిర్వహించడంతో పాటు భక్తులకు తాగునీరు, ప్రసాదం వంటి సదుపాయాలు కల్పించారు.








