పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో (పాదగయ)మహా శివరాత్రి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పిడి పాడా శ్రీనివాసరావు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాట్లు చేయడంలో ఎటువంటి సమస్యలు ఉన్న వెంటనే వాటిని తమ దృష్టికి తీసుకురావాలన్నారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ నామ కనకరావు,ఆలయ సిబ్బంది ఉన్నారు.









