కరప మండలంలో ఉప్పలంక గ్రామంలో చెత్త సంపద కేంద్రాలను ఎంపీడీవో జే శ్రీనివాస్ సందర్శించి పంచాయతీ పనితీరును సమీక్షించారు.చెత్త నుండి సంపద కేంద్రాలను తనిఖీ చేసి వాటి యొక్క గ్రోత్ లెవెల్స్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి మల్లాడి భవానికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో తడి,పొడి చెత్త సేకరణలో జాగ్రత్త తీసుకోవాలని ఐవీఆర్ఎస్ కాల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు.డిప్యూటీ ఎంపీడీవో సలాది వెంకట శ్రీనివాసరావు గ్రామంలో పారిశుధ్యం పనులు చిత్త శుద్ధితో పనిచేయాలని క్లాప్ మిత్రకు తెలిపారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









