లేబర్ కోడ్ లను రద్దుచేయాలని ఈనెల 12 న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ప్రధాన రహదారులు మీదుగా ఉప్పాడా బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ కుంచె చిన్న,డి సత్యనారాయణ,వీరబాబు మాట్లాడుతూ కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్ లు రద్దు చేయాలని,సమాన పనికి సమాన వేతనం,స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత,తదితర సమస్యల పై జరగబోయే సార్వత్రిక సమ్మెలో కార్మికులు అందరూ పాల్గొవాలన్నారు.








