మత్యకారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్,తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు.తేటగుంట పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వార అర్హులైన 25 మంది మత్స్యకారులకు రూ8,33,000 విలువ గల ఇంజిన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈకార్యక్రమంలో అప్పారావు,రంగారావు,కాశీ,రమణ, జగన్నాధం, రమణ,మంగ,లక్ష్మణ్,మణి కుమార్ పాల్గొన్నారు.









