డ్రంక్ అండ్ డ్రైవ్ లో 10 మోటారు సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనాలను ఇష్టారాజ్యంగా నడుపు తున్న పదిమందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు అన్నవరం ఎస్ఐ శ్రీహరిబాబు తెలిపారు. తాగి వాహనాలు నడిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారన్న ఉద్దేశంతో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత చెడుదారులు పడుతుంద ని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు. పోలీ స్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా విక్రయాలు అసాంఘిక కార్యకలాపాలు వంటివి జరిగితే సహించేది లేదని ఎస్ఐ తెలి పారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఎస్సై శ్రీ హరిబాబు తెలిపారు.









