పిఠాపురం పట్టణంలో పారిశుద్ధ్యన్ని మెరుగు పరిచి,జనాభా సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పట్టణపరిధిలో పారిశుధ్య నిర్వహణ ఆస్తవ్యస్థంగా ఉందన్నారు.మురికి కూపంగా కాల్వలు కంపు కొడుతూ దోమలకు అవాసాలుగా మరాయన్నారు.కావున మున్సిపల్ అధికారులు పారిశుధ్య సమస్యను తీవ్రతను గుర్తించి తక్షణం జనాభా సంఖ్యకు అనుగుణంగా తగినంత మంది కార్మికులను నియమించాలన్నారు.ఈ కార్యక్రమంలో బంగారు రామకృష్ణ,కొండేపూడి శంకరరావు,కోనేటి రాజు,వి ఎస్ రెడ్డి,ఎస్ శ్రీకాంత్,జి ఎస్ భాస్కర్, శ్రీనివాస్,లక్ష్మిరావు, పాపారావు,రాజు,కన్నయ్య, సత్యనారాయణ,సూర్యనారాయణ,దేవా,వీరేష్ పాల్గొన్నారు.









