కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఆర్యవైశ్య మహిళలు తలపెట్టిన కిట్టి పార్టీల కార్యక్రమాలకు 25 సంవత్సరాలు పూర్తయ్యాయి.ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ను పిఠాపురం కె.వి.కె.టి ఫంక్షన్ హాలులో ఘనంగా నిర్వహించారు. పౌరాణిక, సాంఘిక, నాటక, నాట్యం పోటీలతో, సినిమా డైలాగులతో సందడి చేశారు. మహిళలు ఎక్కడా తీసిపోమని రుజువు చేశారు. 25 వసంతాల గుర్తులను సభ్యులు నెమరువేసుకున్నారు.








