రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం నిర్వహించనున్న మంత్రులు, కార్యదర్శుల సదస్సుకు కలెక్టర్లు,ఎస్పీలు,ఇతర జిల్లా అధికారుల బృందం వర్చువల్ విధానంలో హాజరు కావాల్సి ఉన్నందున జిల్లా,డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాలను రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు.జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి,ఫిర్యాదులు అందజేయడానికి ఫిబ్రవరి 9న జిల్లా కలెక్టరేట్, డివిజన్, మండల కార్యాలయాలకు రావద్దని విజ్ఞప్తి చేశారు.









