కరపలో నక్క సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో 1976సం 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత కలుసుకుని తమ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సెల్ఫోన్లు, టెలివిజన్లు లేని రోజుల్లో ఒకే చోట కలిసి జీవించిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ అందరూ ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆనందంగా సమయాన్ని గడిపారు. తమకు విద్య నేర్పిన విశ్రాంత ఉపాద్యాయులు సత్యనారాయణ,శివరామ్ లను సత్కరించారు.పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు.









