కాకినాడ జిల్లా పిఠాపురంలో సూర్య నమ స్కార పోటీలు నిర్వహించారు. ఆదివారం ఉదయం పిఠాపురం అగ్రహారం అనగా దత్త క్షేత్రంలో ఈ పోటీలు జరిగాయి. ఆర్ఎస్ఎస్ సేవా భారతి ఆధ్వర్యంలో 13 వ సూర్య నమ స్కారములు (యోగా) పోటీలలో భాగంగా చిన్నారులకు నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు సర్టి ఫికెట్లు అందజేశారు. పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్, షైన్ హాస్పిటల్ వైద్యు రాలు మంజుష సలాది, విశ్రాంత బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ గణేష్, ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు, అనగా దత్తక్షేత్రం సభ్యులు శ్రీనివాస్, సేవా భారతి సభ్యులు పాల్గొన్నారు.










