లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఠాపురం, వెల్దుర్తి పరిసర ప్రాంతాలకు చెందిన 150 మంది నిరుపేద వృద్ధులకు రగ్గులు పంపిణీ చేశారు.శీతాకాలంలో చలి తీవ్రత పెరిగి వృద్ధులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ట్రస్ట్ చైర్మన్ టీ. కామేశ్వరరావు తెలిపారు.డిసెంబర్ నెల నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సందర్భాల్లో వారికి అండగా నిలవడం ట్రస్ట్ యొక్క ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పేదలు, వృద్ధులు, విద్యార్థులు గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సి.హెచ్. అబ్బాయి, మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.









