విద్యా హక్కు చట్టం కింద 2026-27 విద్యాసం ప్రైవేటు పాఠశాలల్లో 25% కోటా సీట్ల ప్రవేశాలకు ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ షెడ్యూల్ విడుదల చేసింది.ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈనెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవాలి.వెబ్ సైట్ ద్వారా గానీ,గ్రామ,వార్డు సచివాలయాలు,మండల విద్యా వనరుల కేంద్రం,సంబంధిత పాఠశాల నుంచి దరఖాస్తులు సమర్పించ్చు.ప్రస్తుత చిరునామా ధ్రువీకరణకు తల్లిదండ్రుల ఆధార్, ఓటరు,రేషన్ కార్డులు,భూమి హక్కుల పత్రం, ఉపాధి హామీ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, విద్యుత్తు బిల్లు,అద్దె ఒప్పంద కాపీని ప్రామాణికంగా తీసుకుంటారు. పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.









