కాకినాడ జిల్లా విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో జేఎన్టీయూకే వద్ద మానవహారం,నిరసనతెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు లోవరాజు,సూరిబాబు,ఏఐవైఎఫ్ రాష్ట్ర సహయ కార్యదర్శి బాబి,పిడిఎస్యు(వి) రాష్ట్ర కార్యదర్శి సతీష్,విద్యార్థి జెఎసి రాష్ట్ర నాయకులు రవితేజలు మాట్లాడుతూ యూనివర్సిటీలో జరిగే దోపిడీ ప్రశ్నిస్తే ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేయడం దుర్మార్గమన్నారు.దీని పై విద్యా,హోమ్ శాఖ మంత్రులు వెంటనే స్పందించి యూనివర్సిటీ లో జరిగే అన్యాయాలు,అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకో వాలన్నారు.ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేయించిన మోహన్ బాబు, విష్ణు ను తక్షణమే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు.ప్రైవేటు,యునివర్సిటీలో ప్రభుత్వ నియంత్రణ ఉండాలని,ఫీజుల దోపిడీ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విడాలన్నారు.









