తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా యం.రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికే ఆయన తిరుమల చేరుకున్నారు. తిరుపతి కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జేసీ ఆర్.గోవిందరావు, ఎస్పీ, ఎల్.సుబ్బారాయుడు రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తిరుమలలోనూ ఈవో రవిచంద్రకు ఘనస్వాగతం పలికారు. తిరుమల అదనపు ఈవో వెంకయ్యచౌదరి, జేఈవో వీరభద్రం పలువురు అధికారులు నూతన ఈవోను కలిశారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో టిటిడి ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ను బదిలీ చేసిన విషయం విధితమే.









