రాష్ట్రంలో ప్రతీ జలాశయం నిండాలని, ప్రతి ఎకరానికి సాగునీరు అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.అమరావతి లో జరిగిన సాగునీటి సంఘాల సమావేశంలో మాట్లా డు తూ నీటి నిర్వహణలో నీటి వినియోగ దారుల సంఘాల పాత్ర అత్యంత కీలక మన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6,047 నీటి వినియోగదారుల సంఘా లు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 58 ప్రాజెక్ట్ కమిటీలకు ఎన్నికలు నిర్వహిండం జరిగిందని తెలిపారు. సుమారు 60,000 మంది సంఘ సభ్యులు సాగునీటి నిర్వహణలో ప్రత్యక్ష భాగస్వాములయ్యారు. ఈ ఆర్ధిక సంవత్స రంలో రూ.344 కోట్లతో 7,197 పనులు రైతు సంఘాల ద్వారా చేపట్టినట్లు వివరించారు.

భూగర్భజలాల పెంపు, సాగు-తాగు నీరు, పరిశ్రమలకు కొరత లేకుండా నీటిని ఇవ్వడం, భవిష్యత్ అవసరాలకు నీటి వనరులను కాపాడు కోవడం లక్ష్యంతో సాగునీటి సంఘా ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.









