ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో హోరాహోరీగా సాగిన జనసేన పార్టీ మండల అధ్యక్ష పదవుల ఎన్నికల్లో వర్గాలుగా, వివాదస్పదంగా, నిరసనల నడము సాగిన ఎన్నికలు ఉత్కంఠ రేపాయి. అలాంటి పరిస్థితులు నుండి జనసేన నాయకులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నారు. నువ్వా..నేనా అన్నట్టుగా పోటీ పడినప్పటికీ, గెలుపు ఓటములు మాకు ముఖ్యం కాదు. జనసేన పార్టీ సిద్ధాంతమే తమకు ముఖ్యమని రుజువు చేశారు. వివాదస్పదంగా సాగిన ఉప్పాడ-కొత్తపల్లి మండలం జనసేన అధ్యక్షుడి ఎన్నికలో గెలిచిన రావు అక్షయ్ను, అతడిపై పోటీగా నిలబడ్డ వేగిశెట్టి నిఖిల్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలపడం ఆసక్తికరంగా మారింది. జనసేన అంతా ఒక్కటేనంటూ నిఖిల్ తీసుకున్న చొరవ స్నేహపూర్వక వాతావరణం కల్పించిందని జనసైనికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.









