కాకినాడ జగన్నాధపురం శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామి వారి ఆలయ భూముల్లో షాపుల నిర్మాణాన్ని నిలుపుదల చేయాల ని మాజీ కార్పొరేటర్ ఎంజికె కిషోర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ దేవస్థానానికి చెందిన 200గజాల ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆలయం పునర్నిర్మాణ నేప థ్యంలో ఇటువంటి చర్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే కాక శతాబ్ద చరిత్ర గల ఆలయాలను అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..ప్రతి ఏడాది అయ్యప్ప భక్తులు ఈ ఆలయంలో ఇరుముడి కట్టించుకోవడం జరిగేదని, ఆలయం లేకపోవడం వలన అయ్యప్ప భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.









