సంక్రాంతి పండగకు సందడి చేయాలన్న ఆ ఊరికి మాత్రం ఈ సంక్రాంతి పెను విషాదాన్నే నింపింది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆ గ్రామంలో 32 ఏళ్లు పూర్తి దగ్ధమయ్యాయి. గ్రామ ప్రజలు కట్టుబట్టలతో బయట పడ్డారు. పూరిళ్లు కావడంతో అగ్నికి పూర్తిగా అహూతయ్యాయి. అనూహ్యంగా జరిగిన ఈఘటనతో బాధితులు గగ్గొలుతో వీధిన పడ్డారు. పండగపూట సరదాగా గడపాల్సిన ఆ కుటుంబాల్లో విషాదం మిగిలింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ గ్రామానికి చేరుకున్నారు. దగ్గరుండి సహాయకచర్యలు చేపట్టారు. గ్యాస్ లీకవడం వల్ల, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు.









