పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు జిల్లాలో 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని,సి,డిగ్రేడ్ విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు.జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడుతూ సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేసి,ప్రతిరోజు స్లిప్ టెస్ట్ పెడితే తద్వారా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు.








