సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లే కెనాల్ రహదారిలో కారు, ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయ పడ్డారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సామర్లకోట ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వాహనాల వేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.









