ప్రస్తుతం రాష్ట్రంలో ఎగ్ పఫ్ ట్రెండ్ నడుస్తోంది.గత వైసిపి ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలెస్ లో ఎగ్ పఫ్ ల ఖర్చు రూ.3,62,56,700. ప్రజల సొమ్మును పందికొక్కుల్లా మెక్కేసారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఏకంగా ఎగ్ పఫ్ కి కిరీటం పెట్టి మరి, ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం లో జరిగిన విచిత్రాలు ఇంకెన్ని బయటపడతాయోననే చర్చ మొదలైంది.








