వృత్తి విద్యలపై అవగాహనతో మంచి కెరీర్ సాధనకు ప్రభుత్వం కల్పించిన క్షేత్ర స్థాయి సందర్శన ఎంతగానో దోహద పడుతుందని సెవెన్ హిల్స్ పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పసల పద్మ రాఘవరావు అన్నారు.పిఎం శ్రీ బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ అయోధ్యరామపురం కు చెందిన ప్రీ వొకేషనల్ విద్యార్థులు రాగంపేట లోని సెవెన్ హిల్స్ పేపర్ మిల్స్ ను సందర్శించారు. విద్యార్ధులకు ఫ్యాక్టరీ ఉత్పత్తుల గురించి వివరించారు.
స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న శ్రీ వేంకట సాయి లక్ష్మీ గణపతి టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ను కూడా విద్యార్థులు సందర్శించారు. ఎండి.జి బూరయ్య వారికి టెక్స్టైల్స్ ఉత్పత్తుల విధానాన్ని తెలిపారు. ఉపాధ్యాయులు, అధ్యాపక బృందం కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించిన ప్రతిభ విద్యానికేతన్ అధినేత ప్రకాశ్ కు, బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ హెచ్ ఎమ్ తోటకూర సాయిరామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.









